News

గవర్నర్ రాజీనామా


ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా చేశారు. 2013 జులైలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రభుత్వానికి, లెఫ్టెనెంట్ గవర్నర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండున్నరేళ్ల పదవీకాలం ఉండగానే జంగ్ రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు. ఆయన తిరిగి విద్యారంగానికి వెళ్తారని భావిస్తున్నారు. ప్రధానికి, సిఎంకు, ప్రజలకు జంగ్ కృతజ్ఞతలు తెలిపారు.